శ్రీనగర్/న్యూఢిల్లీ: నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు మనీ లాండరింగ్ కేసులో ఈడీ సోమవారం సమన్లు జారీ చేసింది. మంగళవారం తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ కేసులో జనవరి 11న అబ్దుల్లాకు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. తాజా సమన్లకు కూడా ఫరూక్ స్పందించరని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్ క్రికెట్ సంఘం నిధుల పంపకంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ 2012లో ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ కేసు నమోదు చేసింది. 2018లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్షీట్ ఆధారంగా ఈడీ ఈ కేసును రిజిస్టర్ చేసింది.