న్యూఢిల్లీ, జనవరి 13: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేయగా.. కేజ్రీవాల్ అన్ని సార్లు విచారణకు గైర్హాజరయ్యారు. సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని, ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ గతంలో డిమాండ్ చేశారు.