Ranbir Kapoor | ముంబై: బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ యాప్కు చెందిన పలు వాణిజ్య ప్రమోషన్లలో రణ్బీర్ పాల్గొనడమే కాక, యాప్ ప్రమోటర్లలో ఒకరి వివాహ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వడానికి పెద్దయెత్తున నగదు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది.