న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ డ్రైవర్ గృహంపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. అతని నుంచి 16 లక్షల విలువైన వస్తువులు, రూ.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు శనివారం ప్రకటించారు.
ఈ కేసులో ఇప్పటికే సెంథిల్ బాలాజీ అరస్టై చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలులో ఉండగా, ఈడీ అధికారులు ఈ నెల 3న కోయంబత్తూరు, కరూర్ జిల్లాల్లో దాడులు నిర్వహించారు. నగదుకు ఉద్యోగాల స్కామ్లో జూన్ 14న మంత్రి బాలాజీపై ఈడీ దాడులు చేసి అరెస్ట్ చేసింది.