Mahua Moitra | న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. ఆమెపై మంగళవారం ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. అయితే ఆమె విచారణకు హాజరుకాలేదు. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్, లేదా ఎన్ఆర్ఐ ఖాతాకు లింక్ చేసిన లావాదేవీలపై ఈడీ ఆమెను ప్రశ్నించాలని కోరింది.
మహువా మొయిత్రా ఈ విషయంలో తాను ఏ తప్పు చేయలేదని ఖండించారు. పార్లమెంట్లో ఆవేశపూరిత చర్చలకు పేరుగాంచిన మహువా.. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు అడగటానికి బహుమతులు అందుకున్నదని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ నివేదిక ఇవ్వటంతో గత డిసెంబర్లో ఆమెను సభ నుంచి బహిష్కరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ స్థానం నుంచి మహు వా పోటీచేస్తున్నారు.