న్యూఢిల్లీ, మార్చి 6: మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలంటూ తాము పదేపదే సమన్లు పంపినా వాటిని తిరస్కరిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై చర్య తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 8 సార్లు సమన్లు పంపినా వాటిని లెక్కచేయలేదని ఆరోపిస్తూ ఐపీసీ 174 సెక్షన్ కింద తాజా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును ఈ నెల 16న విచారించనున్నట్టు కోర్టు తెలిపింది. అయితే మార్చి 12 తర్వాత వర్చువల్గా తాను విచారణకు హాజరు అవుతానని కేజ్రీవాల్ ఇదివరకే తెలిపారు.