Vivo | మనీలాండరింగ్ వ్యవహారంలో చైనాకు చెందిన ప్రముఖ సెల్ఫోన్ల తయారీ కంపెనీ వివోపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈడీ చార్జిషీట్లో అభియోగాలను మోపింది. కంపెనీ 2014-2021 మధ్య దేశం నుంచి రూ.లక్ష కోట్లను దేశం నుంచి తరలించేందుకు షెల్ కంపెనీలను ఉపయోగించినట్లు ఆరోపించింది. ఈ కేసులో లావా ఇంటర్నేషనల్ కంపెనీ ఎండీ హరి ఓం రాయ్, చైనా నేషనలిస్ట్ గ్వాంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్స్ను నితిన్ గార్గ్, రాజన్ మాలిక్లను అక్టోబర్లో ఈడీ అరెస్ట్ చేసింది.
కేసును 2022 కేసు దర్యాప్తును ప్రారంభించిన ఈడీ.. చైనా జాతీయులు, అనేక భారతీయ కంపెనీలతో కూడిన పెద్ద మనీలాండరింగ్ రాకెట్ను ఛేదించినట్లు పేర్కొంది. గతేడాది జులైలో వివో ఇండియాతో పాటు సంబంధిత వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో భారత్ నుంచి భారీ మొత్తంలో చైనీస్ ఫోన్ల కంపెనీ 2014లో భారత్లో పలు నగరాల్లో 19 కంపెనీలను ఏర్పాటు చేసిందని, ఆయా కంపెనీలకు చైనా జాతీయులు డైరెక్టర్లు లేదంటే వాటాదార్లుగా ఉన్నారని పేర్కొంది. వీవో 2014 నుంచి 2018 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది.