ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో సుమారు 3034 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన సుమారు 19,344 కోట్లు అటాచ్ చేశారు.అటాచ్ చేసిన ప్రాపర్టీల్లో ముంబైకి చెందిన ఉషా కిరణ్ బిల్డింగ్, ఖండాలాలోని ఫార్మ్హౌజ్, అహ్మదాబాద్లోని సనాంద్లో ఉన్న భూమి ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు చెందిన 7.71 కోట్ల విలువైన షేర్లను కూడా జప్తు చేశారు. అనిల్ అంబానీకి చెందిన రైస్ ట్రస్ట్ ఆధీనంలో ఆ గ్రూపు ఉన్నది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పడిన సిట్ బృందం రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూపు కేసులను విచారిస్తున్నది.
మనీల్యాండరింగ్తో పాటు నిధుల మళ్లింపు, బ్యాంక్ నిధుల దుర్వినియోగం కోణంలో కేసు విచారణ జరుగుతున్నది. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆ కేసులపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఆర్కామ్తో పాటు ఆ గ్రూపు కంపెనీలు దేశీయ, విదేశీ కంపెనీల నుంచి రుణాలు తీసుకున్నది, ఆ మొత్తం విలువ సుమారు 40,185 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.