ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన ఒక కంపెనీకి సంబంధించి హవాలా లావాదేవీలు జరిగాయని సమాచారం. ఈ లావాదేవీలతో సత్యేంద్ర జైన్కు కూడా సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.