న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2021-22 సంవత్సరానికి చెందిన ఆర్ధిక సర్వే నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆర్థిక సర్వే ప్రకారం.. 2022-23 సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. విభిన్న రంగాల్లో ఉన్న ఆర్థిక స్థితిగతులను ఆ సర్వేలో వివరించారు. ఆయా రంగాల అభివృద్ధికి చేపట్టిన సంస్కరణల గురించి కూడా రిపోర్ట్లో వెల్లడించారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను తయారు చేసింది. కొత్త సీఈఏగా నాగేశ్వరన్ ఇటీవల కేంద్రం నియమించిన విషయం తెలిసిందే.