భోపాల్: మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కేంద్రం ఎన్నికల సంఘం (ECI) నిలిపేసింది. శుక్రవారం పోలింగ్ ఉన్నందున బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారానికి అనుమతి లేదని ఈసీ నిబంధనలు కచ్చితంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలు కావస్తున్నా సీఎం తన ప్రచారాన్ని ఇంకా ముగించకపోవడంతో ఈసీ అధికారులు అడ్డుకుని నిలిపేశారు.
బుధవారం సాయంత్రం 5 గంటలు దాటినా సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఇంకా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతో సీఎం ప్రచారం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న ఈసీ అధికారులు క్యాంపెయిన్ను నిలిపివేయాలని ఆదేశించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
కాగా, మధ్యప్రదేశ్లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం 230 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కమల్నాత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అయితే సీఎం పదవిని ఆశించి భంగపడ్డ యువ నాయకుడు జ్యోతిరాధిత్య సింథియా తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పంచన చేరారు. దాంతో కమల్నాథ్ సర్కారు కూలిపోయి, శివరాజ్సింగ్ చౌహన్ సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. సింథియాకు మంత్రి పదవికి దక్కింది.