Lok Sabha Elections | న్యూఢిల్లీ, మార్చి 9: సార్వత్రిక ఎన్నికల ప్రకటనపై ఇప్పటికే పలు ఊహాగానాలు వె లువడుతున్నాయి. నేడో రేపో షెడ్యూల్ వెలువడుతుందని చాలామంది భావిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం గా ఉన్న జమ్ము, కశ్మీర్లో భారత ఎన్నికల సం ఘం ఈనెల 11 నుంచి 13 వరకు పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు నిర్వహిం చే పరిస్థితులు ఉన్నాయా? తదితర అం శాలను ఈసీ పరిశీలించనుంది. ఆ పరిశీలన పూర్తయిన తర్వాతే ఈ నెల 14 లే దా 15న మాత్రమే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
జమ్ము-కశ్మీర్లో ఈ ఏడాది సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలంటూ 370వ ఆర్టికల్ రద్దు సమర్ధన సందర్భం గా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా? లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందా? తదితర అంశాలను పరిశీలించాలని ఈసీ ప్యానల్ను కేంద్రం కోరింది. దీని మేరకు యూటీకి వెళ్లనున్న ఈసీ పరిశీలన పూర్తయిన వెంటనే ఎన్నికల తేదీల ను ప్రకటిస్తుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
ఇక జమ్ము-కశ్మీర్ విషయానికొస్తే అక్క డ 370వ అధికరణ రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, శాంతి భద్రత లు, ఎన్నికల నిర్వహణకు ఎంత సం ఖ్యలో భద్రతా బలగాలను మోహరించాలి? అంశాలను ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ తదితరులతో కూడి న బృందం నిశితంగా పరిశీలిస్తుంది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రద్దు చేసిన ఎన్నికల బాండ్లకు సం బంధించిన సమాచారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పిం చే వరకు ఎన్నికల షెడ్యూల్ను వి డుదల చేయవద్దంటూ 79 మం ది మాజీ ప్రభుత్వ అధికారులు ఎ న్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ సమాచారాన్ని క్రోడీకరించలేమం టూ ఎస్బీఐ చేస్తున్న వాదనను చూస్తే బాండ్ల ద్వారా క్విడ్ ప్రోకోకు పాల్పడిందన్న విమర్శల నుంచి ప్రభుత్వాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతున్నదని ‘కానిస్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్’ పేరిట సీఈసీకి లేఖ రాశారు.