న్యూఢిల్లీ: పొలిటికల్ హోర్డింగ్స్(Political Hoardings)పై ఎన్నికల సంఘం(Election Commission) కఠినంగా వ్యవహరించనున్నది. ఆ హోర్డింగ్లకు బాధ్యులైన పబ్లిషర్స్, ప్రింటర్లపై చర్యలు తీసుకోనున్నట్లు ఈసీ తెలిపింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ మున్సిపాల్టీ సుమారు ఆరు లక్షల పొలిటికల్ యాడ్స్ను తొలగించింది. ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం.. ఢిల్లీ మున్సిపాల్టీ 2.64 లక్షల హోర్డింగ్లు, 2.67 లక్షల పోస్టర్లను తొలగించారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న పోస్టర్లు, హోర్డింగ్లు, బ్యానర్లను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోనే తీసి వేయాల్సి ఉంటుంది. మే 25వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి.