EC | న్యూఢిల్లీ, మార్చి 18: లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం పెద్దయెత్తున బదిలీలు చేపట్టింది. ప లు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులపై సోమవా రం వేటు వేసింది. పశ్చిమబెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను విధుల నుంచి తప్పించడంతోపాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖం డ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని ఆదేశించింది. వీరంతా ఆయా రాష్ర్టాల సీఎం కా ర్యాలయాల్లో రెండు రకాల విధులు నిర్వహిస్తున్నట్టు గుర్తించినట్టు ఈసీ వర్గాలు తెలిపా యి. అదేవిధంగా మిజోరం, హిమాచల్ప్రదేశ్ సాధారణ పరిపాలనా విభాగాల కార్యదర్శుల ను కూడా తొలగించాలని ఆదేశాలు జారీచేసిం ది. నిష్పాక్షికత, తటస్థత కోసం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
రాజీవ్ కుమార్ను గతంలో 2016 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల విధుల నుంచి ఎన్నికల సంఘం తప్పించింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తాజాగా డీజీపీ బాధ్యతల నుంచి తప్పించారు. కాగా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం గంటల వ్యవధిలోనే రాజీవ్కుమార్ స్థానంలో వివేక్ సహాయ్ను కొత్త డీజీపీగా నియమించింది. మరోవైపు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇక్బాల్ సాంగ్ చాహల్ సహా పలువురు అదనపు, డిప్యూటీ కమిషనర్లను తొలగించాలని ఈసీ ఆదేశాలను మహారాష్ట్ర ప్ర భుత్వం పాటించలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.