PM Modi | చెన్నై: లోకసభ ఎన్నికల తొలిదశ పోలిం గ్ దగ్గరపడుతున్న వేళ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల వ్యాఖ్య లు ఎన్నికల వేడిని పెంచుతున్నాయి. తమిళనాడులో డీఎంకే నాయకుడు ఒక రు ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్య లు చేశారు. ప్రస్తుత ప్రధాని మోదీ లోక్సభ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే.. మటన్, చికెన్పైనా నిషేధం విధిస్తాడంటూ విమర్శించారు.
ప్రజల ఆహార ఎంపికపైనా ప్రధాని మోదీ ఆంక్షలు విధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ స్థానాలకు తొలి దశ పోలింగ్తో ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి 38 స్థానాలు గెలుచుకుంది.