న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రతి రోజు బాదాం తినటం వల్ల మధుమేహం నుంచి కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ఊబకాయంతో బాధపడే వ్యక్తులు ప్రతి రోజు బాదాం తినటం వల్ల బరువు, చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. 12 వారాల పాటు కొందరితో బాదాం తినిపించి వారిని పరీక్షించగా ఆశాజనక ఫలితాలు వచ్చాయని చెన్నైకి చెందిన మద్రాస్ డయాబెటిస్ రిసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇన్సులిన్ నిరోధకత తగ్గిందని, బీటా కణాలు ఉత్తేజితమై క్లోమం పనితీరు మెరుగుపడిందని వివరించారు.