న్యూఢిల్లీ: అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 2.21 గంటలకు అండమాన్ సముద్రంలోని 40 కిలో మీటర్ల లోతులో ఇది సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.6గా నమోదైనట్లు పేర్కొంది. టోంగా దీవులు, ఎలుక దీవులలో కూడా వరుసగా 5.9, 6.2 తీవ్రతతో భూకంపాలు వచ్చినట్లు వివరించింది. అలాగే ఆఫ్ఘనిస్థాన్లోని హిందు కుష్ ప్రాంతంలో 4.6 తీవ్రతతో శనివారం భూకంపం సంభవించినట్లు వెల్లడించింది.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 30 వరకు సంభవించిన భూకంపాల సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సీఎస్) బయట పెట్టింది. ఈ కాలంలో మొత్తం 81 భూకంపాలు నమోదైనట్లు తెలిపింది. ఇందులో 73 భూకంపాలు దేశంతోపాటు పొరుగు ప్రాంతాల్లో సంభవించినట్లు వెల్లడించింది. భారత్తోపాటు పొరుగున ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా భూకంపాలు హిందూ కుష్ ప్రాంతం, ఉత్తర లడఖ్, ఉత్తర హిమాచల్ ప్రదేశ్, ఉత్తర జమ్ముకశ్మీర్, ఉత్తర ఉత్తరాఖండ్తోపాటు అండమాన్ సముద్రం, అండమాన్-నికోబార్ దీవుల ప్రాంతంలో సంభవించినట్లు ఒక నివేదికలో పేర్కొంది.
అలాగే ఉత్తర హర్యానాలోని రోహ్తక్, తూర్పు ఒడిషాలోని గంజాం, దక్షిణ కర్ణాటకలోని బీజాపూర్, చిక్కబళ్లాపుర, ఆంధ్ర ప్రదేశ్లోని నెల్లూరు, కేరళలోని కొల్లాం, తమిళనాడులోని దిండిగల్, ఎంపీలో సింగ్రౌలీతోపాటు దేశంలోని మధ్య భాగంలో కూడా చిన్నపాటి భూకంపాలు నమోదయ్యాయినట్లు వెల్లడించింది.
Earthquake of Magnitude:4.6, Occurred on 05-06-2022, 14:41:46 IST, Lat: 9.02 & Long: 93.54, Depth: 40 Km ,Location: Andaman Sea for more information download the BhooKamp App https://t.co/wHOeA0n4Fp @Indiametdept @ndmaindia pic.twitter.com/mGtZ90jr3O
— National Center for Seismology (@NCS_Earthquake) June 5, 2022