న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. శుక్రవారం రాత్రి క్యాంప్బెల్ బేలో భూమి కంపించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూ అంతర్భాగంలో 63 లోతులో భూమి కంపించిందని వెల్లడించింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో గత కాలంగా తరచూ భూకంపాలు వస్తున్నాయి. ఈనెల 22న కూడా భూమి కంపించింది. గత బుధవారం 3.9 తీవ్రతతో భూ ప్రకంపణలు వచ్చాయని ఎన్సీఎస్ తెలిపింది.