న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 8.33 గంటలకు తెహ్రీలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. తెహ్రీకి 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని తెలిపింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
Earthquake of Magnitude:4.5, Occurred on 06-11-2022, 08:33:03 IST, Lat: 30.67 & Long: 78.60, Depth: 5 Km ,Location: 17km ESE of Uttarkashi, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/yKe188oYKK@Indiametdept @ndmaindia pic.twitter.com/fVmaobLVlM
— National Center for Seismology (@NCS_Earthquake) November 6, 2022
గత నెలలో ఉత్తరాఖండ్లో రెండుసార్లు భూకంపం వచ్చింది. అక్టోబర్ 8న 3.9 తీవ్రతతో మున్సియారీలో భూమి కంపించింది. అక్టోబర్ 2న 2.5 తీవ్రతతో ఉత్తరకాశీలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.