షిల్లాంగ్: ఈశాన్య భారతంలో వరుస భూకంపాలతో ప్రజలు భయకంపితులవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున అరుణాచల్ప్రదేశ్లో భూమి కంపించగా, నేడు మేఘాలయలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున 3.46 గంటల సమయంలో మేఘాలయలోని తురాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. తురాకు 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూపొరల్లో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది.
Earthquake of Magnitude:3.4, Occurred on 24-11-2022, 03:46:25 IST, Lat: 25.60 & Long: 90.56, Depth: 5 Km ,Location: 37km ENE of Tura, Meghalaya, India for more information Download the BhooKamp App https://t.co/cvUUKQabAb@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/HBec5rGogl
— National Center for Seismology (@NCS_Earthquake) November 23, 2022
బుధవారం ఉదయం 7 గంటలకు అరుణాచల్ప్రదేశ్లోని బాసర్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదయింది. అంతకు ముందు మహారాష్ట్రలోని నాసిక్లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది.