ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటల సమయంలో భూమికంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. కాగా, మధ్యరాత్రి భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అంతకుముందు నేపాల్లోని బాగ్లంగ్ జిల్లాలో వరుసగా రెండు సార్లు భూమి కంపించింది. తెల్లవారుజామున 1.23 గంటలకు జిల్లాలోని అధికారి చౌరు ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదయిందని నేషనల్ ఎర్త్క్వేక్ మానిటరింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ (NEMRC) వెల్లడించింది. మరో 40 నిమిషాల వ్యవధిలో జిల్లాలోని మరో ప్రాంతం భూమి కంపించిందని తెలిపింది.
An Earthquake of ml 4.7 occurred around Adhikari Chaur of Baglung District at 01:23 on 2079/09/13 NEMRC/DMG.@NEOCOfficial @NDRRMA_Nepal
— NEMRC, Nepal (@NepalNsc) December 27, 2022
తెల్లవారుజామున 2.07 గంటల సమయంలో బాగ్లంగ్ జిల్లా ఖుంగాలో 5.3 తీవ్రతతో భూ ప్రకంపణలు వచ్చాయని ఎన్ఈఎంఆర్సీ వెల్లడించింది. స్వల్ప వ్యవధిలో వచ్చిన వరుస భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నది.
An Earthquake of ml 5.3 occurred around Khunga of Baglung District at 02:07 on 2079/09/13 NEMRC/DMG.@NEOCOfficial @NDRRMA_Nepal
— NEMRC, Nepal (@NepalNsc) December 27, 2022