రామగిరి, మే 6: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్పై కాంగ్రెస్ నాయకుల దాడులు అవివేకమని, ఒక పిరికిపంద చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయాలతో బయటపడ్డ మాజీ సర్పంచ్ బుర్ర శంకర్గౌడ్ను సోమవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయానికి పిలిపించుకొని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.
శంకర్గౌడ్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ నేతలు దాడులకు తెగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉండగా ప్రత్యర్థులపై ఇలా దాడులకు పాల్పడలేదని గుర్తుచేశారు. శంకర్గౌడ్ మాట్లాడుతూ ప్రచారంలో బిజీగా ఉన్నా, కేటీఆర్ తనను హైదరాబాద్కు పిలిపించి ధైర్యం చెప్పటం భరోసానిచ్చిందని వెల్లడించారు.