e-Pind Daan | దేశంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉన్నాయి. ఈ సంప్రదాయాలకు ఎంతో ప్రత్యేక ఉన్నది. పిండ ప్రదానం ( Pinda Pradanam ) సైతం భారత్లో పురాతనకాలం నుంచ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. చనిపోయిన తల్లిదండ్రులతో పాటు పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. దాంతో చనిపోయిన వారి ఆత్మ మోక్షం పొందుతుందని పండితులు చెబుతుంటారు.
అయితే, పిండ ప్రదానాలకు పలు క్షేత్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంటారు. దేశవ్యాప్తంగా చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడానికి 55 పుణ్యక్షేత్రాలున్నాయి. ఇందులో బిహారలోని గయ ప్రముఖమైంది. గయ ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ అనేక ఆలయాలకున్నాయి. ఇక్కడ చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం వెనుక కారణం ఏంటంటే? ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షం పొందుతారని విశ్వసిస్తారు. హిందూ ఇతిహాసాల ప్రకారం.. శ్రీరాముడు గయలోనే తన తండ్రి దశరథుడికి పిండ ప్రదానం చేశాడని చెబుతుంటారు.
అయితే బిహార్లో ఉన్న గయకు అందరూ వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో గయకు రాలేని వారి కోసం బిహార్ ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పిస్తున్నది. ఇకపై ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో పిండ ప్రదానం చేసే అవకాశం కల్పిస్తున్నది. ఇందు కోసం బిహార్ స్టేట్ టూరిజం కార్పొరేషన్ ఏర్పాట్లు చేసింది. అయితే, ఇందు కోసం రూ.23వేలు చెల్లించి ఈ-పిండ ప్రదాన్ ద్వారా పూర్వీకులకు పిండ ప్రదానం చేయవచ్చని టూరిజం పేర్కొంది. అయితే, మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గయ పూజారులు విష్ణుపాద్ ఆలయం, అక్షయవత్, ఫల్గునది వద్ద పిండ ప్రదానం చేస్తారు.
అన్ని క్రతువులు అన్ని ఆన్లైన్లో నిర్వహించనున్నారు. క్రతువు అంతా రికార్డింగ్ సైతం చేసి.. పెన్డ్రైవ్లో చేయనున్నారు. అలాగే, పూజలు చేయించుకున్న వారికి అందుబాటులో ఉంచనున్నారు. ఈ సారి పితృపక్షాలు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు జరుగనున్నాయి. దీంతో చాలా మంది గయకు తరలిరానున్నారు. మరో వైపు దేశ విదేశాల నుంచి గయకు పర్యాటకులు తరలివస్తారు. భారీగా డబ్బు ఖర్చు చేసినా పలు సౌకర్యాలు అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో బిహార్ స్టేట్ టూరిజం కార్పొరేషన్ పలు ప్యాకేజీలను సైతం ప్రకటించింది.