E-Pantry : భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్సీటీసీ (IRCTC) ఇ-ప్యాంట్రీ (E-Pantry) సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలుత వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ సేవలను ప్రారంభించారు. మొత్తం 25 మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్యాంట్రీ కార్ కలిగిన ఎంపిక చేసిన రైళ్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
కన్ఫామ్ టికెట్, ఆర్ఏసీ, పాక్షికంగా టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులు ఇ-ప్యాంట్రీ ద్వారా ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్యాంట్రీ కార్ స్టాఫ్ సీటు దగ్గరకే ఆహారాన్ని డెలివరీ చేస్తారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ‘బుక్డ్ టికెట్ హిస్టరీ’ సెక్షన్లో ఇ-ప్యాంట్రీ మీల్ ఆప్షన్ కనిపిస్తుంది. మీల్ బుక్ చేసుకున్నాక మీల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని డెలివరీ సమయంలో చూపించాలి.
విశాఖ నుంచి వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ కూడా ఈ జాబితాలో ఉంది. దశల వారీగా మిగిలిన రైళ్లకూ ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఇ-ప్యాంట్రీ ద్వారా స్టాండర్డ్ లేదా రైల్నీర్ను బుక్ చేసుకోవచ్చు. ట్రెయిన్ ఎక్కాక ఆహారం కోసం ఆలోచన చేయాల్సిన అవసరం తప్పుతుంది. డిజిటల్ మోడ్లో చెల్లింపులు చేయవచ్చు. ఆన్లైన్లో మీరు ఫుడ్ బుక్ చేసుకోగానే మీకు మీల్ వెరిఫికేషన్ కోడ్ అందుతుంది.
మీల్ ఆర్డర్ నుంచి డెలివరీ వరకు ట్రాకింగ్ ఉంటుంది. ఏదైనా కారణంతో ఫుడ్ డెలివరీ అవ్వకపోతే ఆ సమాచారం కూడా ఎస్సెమ్మెస్/ ఇ-మెయిల్ ద్వారా సమాచారం వస్తుంది. ఆన్లైన్లోనే రిఫండ్ అయిపోతుంది.