అహ్మదాబాద్, సెప్టెంబర్ 19: గుజరాత్లోని ముంద్రా పోర్టులో రూ.48 కోట్ల విలువైన ఈ-సిగరెట్ స్టిక్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీజ్చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోర్టులో సోదాలు చేసిన అధికారులు ఈ-సిగరెట్ కంటెయినర్లను గుర్తించారు.
ఫ్లోర్ క్లీన్ చేసే వస్ర్తాల పేరుతో దిగుమతి అయిన బాక్సుల్లో ఈ స్టిక్స్ ఉన్నట్టు తెలిపారు. 250 బాక్సుల్లో 2,500 చొప్పున 2లక్షల ఈ-సిగరెట్లు ఉన్నట్టు నిర్ధారించారు. కాగా ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే.