న్యూఢిల్లీ, మే 6: రాజకీయ పార్టీలకు వారి సోషల్ మీడియా వేదికల్లోని నకిలీ కంటెంట్ గురించి సమాచారం ఇచ్చిన మూడు గంటల్లోగా ఆ కంటెంట్ను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించి కొందరు ప్రముఖ నాయకులు, సెలబ్రిటీల డీప్ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించింది. కృత్రిమ మేధ(ఏఐ) టూల్స్ను దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాలని హితవు పలికింది.