ముంబై: ఎడతెరపి లేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని రాయ్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఖాలాపూర్ తాలూకా ఇర్షాల్వాడీ గ్రామంలోని ఇండ్లపై హఠాత్తుగా కొండచరియలు విరిగి పడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 48 గిరిజన కుటుంబాలకు చెందిన 100 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న 21మంది క్షతగాత్రుల్ని బయటకు తీశారు. గ్రామస్థులు గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది.