లక్నో: రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పటాకులు తీసుకెళ్లాడు. అతడు సిగరెట్ వెలిగించడంతో ఆ పటాకులు పేలాయి. దీంతో ఆ రైలులో మంటలు చెలరేగాయి. (Fire Breaks Out In Train) ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బీహార్లోని లాల్గఢ్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్లోని బరేలీ జంక్షన్కు చేరుకుంది. ఎస్2 కోచ్లో ప్రయాణించిన వ్యక్తి ఆ రైలులో అక్రమంగా క్రాకర్స్ తరలిస్తున్నాడు. అంతేగాక అతడు రైలులో సిగరెట్ వెలిగించాడు. ఆ నిప్పు రవ్వలు పటాకులకు అంటుకున్నాయి. దీంతో అవి పేలడంతో రైలులో మంటలు రాజకున్నాయి. ఇది చూసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్న మిగతా ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆ కోచ్ వద్దకు చేరుకుని మంటలు ఆర్పినట్లు చీఫ్ ఫైర్ అధికారి తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పారు. రైలులో అక్రమంగా క్రాకర్స్ తరలించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.