ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన నేత కుమారుడు (Shinde Sena Leader’s Son) మద్యం సేవించి బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేశాడు. స్కూటర్పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహిళ మరణించగా ఆమె భర్త గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న శివసేన నేత కుమారుడి కోసం వెతుకుతున్నారు. పాల్ఘడ్ జిల్లాకు చెందిన శివసేన డిప్యూటీ లీడర్ రాజేష్ షా కుమారుడైన 24 ఏళ్ల మిహిర్ షా శనివారం రాత్రి జూహులోని ఒక బార్లో మద్యం సేవించాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వెళ్తుండగా లాంగ్ డ్రైవింగ్కు వెళ్దామని డ్రైవర్తో అన్నాడు.
కాగా, వర్లీ ప్రాంతానికి చేరగా కారు తాను డ్రైవ్ చేస్తానని మిహిర్ షా పట్టుబట్టాడు. బీఎండబ్ల్యూను వేగంగా నడిపిన అతడు స్కూటర్పై వెళ్తున్న చేపలు అమ్ముకునే భార్యాభర్తలను ఢీకొట్టాడు. వర్లీలోని కోలివాడ ప్రాంతానికి చెందిన కావేరి కారు కింద నలిగి మరణించగా ఆమె భర్త ప్రదిక్ తీవ్రంగా గాయపడ్డాడు.
మరోవైపు ఈ ప్రమాదం తర్వాత శివసేన నేత కుమారుడు మిహిర్ షా అక్కడి నుంచి పారిపోయాడు. అలాగే
కారు నంబర్ ప్లేట్లను తొలగించారు. కారు వెనుక అద్దంపై ఉన్న శివసేన స్టిక్కర్ను చించివేశారు. అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. శివసేన కుమారుడు, కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి పరారీలో ఉన్న మిహిర్ షా కోసం పోలీసులు వెతుకుతున్నారు.