న్యూఢిల్లీ : మందుబాబులు కొందరు మద్యం మత్తులో ఏం చేస్తుంటారో వారికే తెలియదు. మద్యం ఎంత తీసుకున్నా కొందరు కంట్రోల్గా ఉంటే అతిగా మద్యం సేవించిన మరికొందరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి. లేటెస్ట్గా మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా సైన్ బోర్డుపైకి ఎక్కి పుషప్స్ తీసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఒడిషాలోని సంబల్పూర్లో ఈ వీడియోను రికార్డు చేయగా ఇన్స్టాగ్రాంలో తెగ వైరలవుతోంది. ఈ వైరల్ క్లిప్లో ఓ వ్యక్తి హై సైన్బోర్డుపైకి ఎక్కి దానిపై పుషప్స్ తీస్తూ కనిపించారు. ఈ వీడియోను ఏకంగా 7.4 లక్షల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. అంతటి ఎత్తులో ఉన్న సైన్బోర్డుపై అతడి నిర్వాకం పట్ల పలువురు నెటిజన్లు భగ్గుమన్నారు. ఈ న్యూసెన్స్పై అసహనం వ్యక్తం చేసిన పలువురు యూజర్లు అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read More :
Elon Musk: వీలైనంత త్వరగా ఇండియాకు టెస్లా కంపెనీ: ఎలన్ మస్క్