అహ్మదాబాద్: ఒక యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశాడు. వేగంగా స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుజరాత్లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. (Vadodara Accident) గురువారం రాత్రి కరేలిబాగ్ ప్రాంతంలో వేగంగా దూసుకెళ్లిన కారు స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై ప్రయాణించిన ఇద్దరు మహిళల్లో ఒకరు మరణించారు. మృతురాలిని హేమాలిబెన్ పటేల్గా గుర్తించారు. 12 ఏళ్ల జైని, 35 ఏళ్ల నిషాబెన్తో పాటు పదేళ్ల బాలిక, 40 ఏళ్ల వ్యక్తి ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ ప్రమాదంలో ఆ కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ సంఘటన తర్వాత మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ కిందకు దిగాడు. ‘మరో రౌండ్, మరో రౌండ్’, ‘ఓం నమః శివాయ’ అని రోడ్డుపై అరిచాడు. కొందరు వ్యక్తులు అతడ్ని పట్టుకుని దాడి చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు ఆ వ్యక్తిని అప్పగించారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని రక్షిత్ రవీష్ చౌరాసియాగా గుర్తించారు. ఎంఎస్ యూనివర్సిటీలో లా విద్యార్థి అని తెలుసుకున్నారు.
మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కారు డ్రైవర్, అందులోని మరో వ్యక్తి మద్యంతో పాటు డ్రగ్స్ ఏమైనా సేవించారా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#Vadodara: Drunk youth hits 7 on Holi night, 1 dies
Accident near #Karelibagh Amrapali Complex, CCTV of the incident surfaced, condition of two persons is critical. This video contains potentially disturbing situation that may be harmful to some viewers. #Accident #Gujarat pic.twitter.com/AHFGyI3MFO— Namaskar Gujarat Australia (@NamaskarGujarat) March 13, 2025
Trigger warning : Horrible accident in Vadodara. A young boy has run over three people. The car is registered in the name of Deon Technology Pvt Ltd. pic.twitter.com/2bJK4F1qGI
— Mohammed Zubair (@zoo_bear) March 13, 2025