Pakistan Drones | న్యూఢిల్లీ, మే 12 : జమ్ముకశ్మీర్లోని సాంబ జిల్లాలో అనుమానిత డ్రోన్లు మళ్లీ కలకలం రేపాయి. సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ మరోసారి డ్రోన్లు కలకలం రేపగా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ డ్రోన్లు కనిపించినట్టు ఏఎన్ఐ వీడియో షేర్ చేసింది.
సాంబలో మే 8న, జమ్మూ, అక్నూర్, నాగ్రోటా, అమృత్సర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో సైతం కొన్ని రోజుల క్రితం డ్రోన్లు కనిపించడంతో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. భారత్-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత డ్రోన్లు కనిపించడం మరోసారి చర్చనీయాంశమైంది.
#WATCH | J&K: Red streaks seen and explosions heard as India’s air defence intercepts Pakistani drones amid blackout in Samba.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs
— ANI (@ANI) May 12, 2025
భారత డ్రోన్ల దాడిలో ఏడుగురు మృతి.. పాకిస్థాన్ అధికార వర్గాల వెల్లడి
లాహోర్, మే 12 : భారత్ జరిపిన డ్రోన్ల దాడిలో ఏడుగురు మృతి చెందడంతో పాటు ఆరుగురికి గాయాలైనట్టు పాకిస్థాన్ అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సోమవారం పీటీఐ వెల్లడించింది. పంజాబ్ ప్రావిన్స్లోని గుజరాత్లో ఈ దాడులు జరిగినట్టు తెలిపింది. పాకిస్థాన్కు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ..
శనివారం పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్, చినియట్, పాక్పట్టాన్, ఖరియన్, షేకుపుర, జలపూర్ జట్టన్లో డ్రోన్ దాడులు జరిగినట్టు తెలిపారు. పాక్లోని భారత సరిహద్దు గ్రామాల్లో జరిపిన దాడుల్లో ఏడుగురు మృతి చెందగా.. ఆరుగురికి గాయాలైన ట్టు వెల్లడించారు. లాహోర్కు 400 కి.మీ. దూరంలో ఉన్న పంజాబ్లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లా లో షేక్ జయాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (ఎయిర్బేస్)పై మిసైల్ దాడితో భారీ నష్టం జరిగినట్టు చెప్పారు. యూఏఈ అధ్యక్షుడి కోసం నిర్మించిన రాయల్ లాంజ్ ధ్వంసమైనట్టు తెలిపారు.