న్యూఢిల్లీ, జనవరి 3: గిడ్డంగుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువాహటిలోని ఏరోమోడెలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్హౌజ్ డ్రోన్లను తయారుచేశారు.
గిడ్డంగుల్లో మనుషులకు కష్టమైన పనులను ఈ డ్రోన్లు చేస్తాయి. వీటికి మరింత సాంకేతికత జోడించి భవిష్యత్తులో వస్తువులు డెలివరీ చేసేలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సైనిక, శాంతిభద్రతల పర్యవేక్షణ అవసరాలకు రీపర్ డ్రోన్లను రూపొందించారు.