ఎడారి దేశం సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన ఈ దాడి చేసింది యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ అని వెల్లడైంది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు కన్నుమూశారు. మృతుల వివరాలు సేకరించామని, వారి కుటుంబాలతో చర్చలు జరుపుతున్నామని అబుధాబిలోని భారత ఎంబసీ అధికారులు తెలిపారు.
అయితే మృతుల వివరాలు చెప్పేందుకు మాత్రం వారు నిరాకరించారు. అలాగే ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు గాయాలపాలైనట్లు సమాచారం. వారిలో కూడా ఇద్దరు భారతీయులు ఉండగా, చికిత్స అనంతరం వాళ్లు డిశ్చార్జి అయినట్లు ఎంబసీ అధికారులు తెలియజేశారు.
ఈ విషయాల గురించి ట్వీట్ చేసిన భారత ఎంబసీ.. ‘‘మరణించిన ఇద్దరు భారతీయుల వివరాలు గుర్తించాం. వారి కుటుంబాలతో ఎంబసీ అధికారులు టచ్లో ఉన్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు చేరవేసేందుకు ఏడీఎన్ఓసీ సహా యూఏఈ అధికారులతో కలిసి కృషి చేస్తున్నారు’’ అని పేర్కొంది.
అబుధాబిపై జరిగిన దాడికి ప్రతిగా హౌతీ రెబల్స్ ఆధీనంల ఉన్న యెమెనీ రాజధాని సనాపై సౌదీ నేతృత్వంలోని దళాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్లు అంచనా. అలాగే సౌదీ అరేబియా వైపు వస్తున్న 8 డ్రోన్లను అడ్డుకున్నామని కూడా ఈ దళాలు వెల్లడించాయి.