న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగగా, భారత్ నేవీ వెంటనే రంగంలోకి దిగి.. మంటల్లో చిక్కుకున్న నౌకను, అందులోని సిబ్బందిని కాపాడింది. నౌకలో మొత్తం 23మంది సిబ్బంది ఉన్నారని, ఇందులో 13 మంది భారతీయులే ఉన్నారని ఇండియన్ నేవీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
‘గల్ఫ్ ఆఫ్ ఎడెన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న లైబీరియాకు చెందిన వాణిజ్య నౌక (ఎంఎస్సీస్కై-2)పై మార్చి 4న డ్రోన్ దాడి జరిగింది. దీంతో నౌక మంటల్లో చిక్కుకుంది. ఐఎన్ఎస్ కోల్కతా తక్షణమే స్పందించింది. ప్రత్యేక అగ్నిమాపక బృందం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నది’ అని నేవీ తెలిపింది.