న్యూఢిల్లీ, జనవరి 1: సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ వద్దంటూ ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రమాదాలు, మరణాల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
2021లో రోడ్డు ప్రమాదాలు.. మరణాలు
సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..
ప్రమాదాలు- 1994
మరణాలు-1040
రెడ్సిగ్నల్ జంపింగ్
ప్రమాదాలు-555
మరణాలు-222
రోడ్లపై గుంతల కారణంగా..
ప్రమాదాలు-3,625
మరణాలు-1,482
2021లో మొత్తంగా
రోడ్డు ప్రమాదాలు-4,12,432
మరణాలు-1,53,972