న్యూఢిల్లీ : నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికా అధ్య క్షుడు జో బైడెన్ (G20) కాన్వాయ్లోని ఓ డ్రైవర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపు ప్రశ్నించిన అనంతరం పోలీసులు అతడిని విడిచిపెట్టారు. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయేద్ బస చేసిన తాజ్ హోటల్లోకి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్కు సంబంధించిన వాహనం ఒకటి ప్రవేశించిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డ్రైవర్ను సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జో బైడెన్ బస చేసిన ఐటీసీ మౌర్యకు తాను వెళ్లాల్సి ఉందని, లోధి ఎస్టేట్ ప్రాంతం నుంచి తాను పికప్ చేసుకున్న ఓ వ్యాపారవేత్తను దిగబెట్టేందుకు తాను తాజ్ హోటల్కు వచ్చానని చెప్పినట్టు తెలిసింది.
ప్రొటోకాల్ విషయం తనకు తెలియదని డ్రైవర్ బదులిచ్చాడు. జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఢిల్లీ చేరుకుని అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆదివారం ఉదయం ఆయన వియత్నాం వెళ్లారు.
Read More :
Rishi Sunak | అక్షర్ధామ్ ఆలయంలో యూకే ప్రధాని రిషి సునాక్ ప్రత్యేక పూజలు