న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఐఈడీ పేలుడుకు పాల్పడిన కేసులో డీఆర్డీవో శాస్త్రవేత్తను ఇటీవల క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 47 ఏళ్ల భరత్ భూషన్ కటారియాను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వాంతులు, కడుపునొప్పి వస్తున్నట్లు చెప్పడంతో అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. పోలీసు కస్టడీలో ఉన్న అతను సూసైడ్ చేసుకోని చావాలనుకున్నట్లు తెలుస్తోంది. కటారియా లిక్విడ్ హ్యాండ్వాష్ను తాగినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. అబ్జర్వేషన్లో పెట్టారు. రెండు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అతన్ని తరలించారు. ఎయిమ్స్లో చేర్పించారు. అమిత్ వాశిష్ట్ అనే లాయర్ను కోర్టు రూమ్లో టార్గెట్ చేస్తూ ఐఈడీని పేల్చిన కేసులో కటారియాను పోలీసులు అరెస్టు చేశారు.