న్యూఢిల్లీ, ఆగస్టు 19: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధవిమానాలను శత్రు క్షిపణుల నుంచి రక్షించేందుకు డీఆర్డీవో అధునాతన ఛాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీతో శత్రు క్షిపణులను తమ లక్ష్యాల నుంచి దారి మళ్లించవచ్చు. ట్రయల్స్ తర్వాత ఐఏఎఫ్ ఈ టెక్నాలజీని ఉపయోగించుకోనున్నది. అతితక్కువ ఛాఫ్ మెటీరియల్ను ఉపయోగించి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం విశేషం. కొత్త టెక్నాలజీపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవోను అభినందించారు.