న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చీఫ్ సమీర్ వీ కామత్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ ఏడాదిపాటు పొడిగించింది. శాస్త్రవేత్త కామత్ 2022 ఆగస్టు 25న డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యదర్శిగా, డీఆర్డీవో చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని 2024 జూన్ 1 నుంచి 2025 మే 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పొడిగిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.