బెంగుళూరు: రికార్డు సమయంలో డీఆర్డీవో కొత్త బిల్డింగ్ను నిర్మించింది. బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో కొత్త కాంప్లెక్స్ను కట్టింది. ఆ ఏడు అంతస్తుల ఎఫ్సీఎస్ కాంప్లెక్స్ను కేవలం 45 రోజుల్లోనే డీఆర్డీవో నిర్మించడం విశేషం. ఫిఫ్త్ జనరేషన్ అడ్వాన్స్డ్ విమానాల తయారీ కోసం ఈ కేంద్రాన్ని రీసర్చ్ సెంటర్గా వాడనున్నారు. ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ కాంప్లెక్స్ను ఆవిష్కరించనున్నారు. ఫైటర్ విమానాల కంట్రోల్ వ్యవస్థలకు సంబంధించిన ఏవియానిక్స్ను ఇక్కడ డెవలప్ చేయనున్నారు.