న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో ఆదివారం అనుమానాస్పద రీతిలో మరణించిన టీవీ జర్నలిస్ట్ సులభ్ శ్రీవాస్తవ మృతిపై పూర్తి నివేదిక సమర్పించాలని యూపీ సర్కార్ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మంగళవారం ఆదేశించింది. శ్రీవాస్తవ మరణం పలు అనుమానాలకు తావిస్తున్నట్టు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. జర్నలిస్ట్ మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.