12వ తరగతి ఎగ్జామ్స్పై ఏ నిర్ణయం తీసుకోలేదు: సీబీఎస్ఈ
న్యూఢిల్లీ, మే 14: పన్నెండోతరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శుక్రవారం సీబీఎస్సీ స్పష్టంచేసింది. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ‘12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేశారంటూ వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దు. పరీక్షలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా ఉద్ధృతి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలను రద్దుచేస్తున్నట్టు బోర్డు గతనెల 14న ప్రకటించింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మరోవైపు, పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.