న్యూఢిల్లీ, నవంబర్ 4: ఈ నెల 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గుర్పత్వంత్ సింగ్ హెచ్చరించారు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని మేము సిక్కులను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుం ది. మీ ప్రాణాలకు ప్రమాదం’ అని గుర్పత్వంత్ ఒక వీడియోలో హెచ్చరించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నవంబర్ 19న ఢిల్లీ విమానాశ్రయాన్ని మూసేయనున్నట్టు.. దాని పేరును మార్చనున్నట్టు గుర్పత్వంత్ చెప్పారు. అదే రోజు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుండటాన్ని గుర్తుచేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుంచి మోదీ పాఠాలు నేర్చుకోకపోతే అలాం టి ప్రతిస్పందనే భారత్లో ఎదుర్కోవాల్సి ఉంటుందని గత నెల 10న గుర్పత్వంత్ ప్రధాని మోదీకి హెచ్చరికలు చేశారు.