బెంగళూరు, జనవరి 11: కుల, మత ప్రాధాన్యాలతో కర్ణాటక భవిష్యత్తును పాడుచేయొద్దని ఐటీ పరిశ్రమ ప్రముఖుడు టీవీ మోహన్దాస్ పాయ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును కోరారు. ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన ‘ఎక్స్’లో గురువారం సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘తప్పుడు ప్రాధాన్యతలపై సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దయచేసి రాష్ట్ర భవిష్యత్తును పాడుచేయొద్దు’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ సందేశాన్ని పోస్ట్ చేశారు.
సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి జి పరమేశ్వర.. తదితరులకు తన పోస్ట్ను ఆయన ట్యాగ్ చేశారు. దేశంలో ఇతర రాష్ర్టాలు ఆర్థికంగా, సామాజికంగా దూసుకెళ్తుంటే, కన్నడనాట పాఠశాలల్లో హిజాబ్కు తిరిగి అనుమతి ఇవ్వటం, కన్నడ భాషల్లోనే బోర్డులు, నామ ఫలకాలు ఉండాలని ఆర్డినెన్స్ తేవటం.. మొదలైనవి కాంగ్రెస్ సర్కార్ చేపట్టడాన్ని పలువురు మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు తప్పుబడుతున్నారు. సామాజిక మాధ్యమంలో వారు పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.