న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చేరొద్దని భారతీయ విద్యార్థులను యూజీసీ, ఏఐసీటీఈ హెచ్చరించాయి. అక్కడి విద్యార్హతలు మనదేశంలో చెల్లవని శుక్రవారం స్పష్టం చేశాయి. అయితే, పాక్లో డిగ్రీ పొంది, భారత పౌరసత్వం తీసుకున్న వలసదారులు, వారి పిల్లలు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్తో మన దేశంలో ఉపాధికి అర్హులేనని ప్రకటనలో పేర్కొన్నారు.
చైనా విషయంలోనూ యూజీసీ ఇలాంటి హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే.