బెంగళూరు: బీజేపీ పాలిత కర్ణాటకలో ప్రజలు వినూత్నంగా నిరసన చేశారు. రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం గాడిదతో నిరసన తెలిపారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ జిల్లాలో రహదారులు, మౌలిక సదుపాయాలు లేవు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాకు చెందిన పలు సంస్థలు శుక్రవారం బంద్కు పిలుపునిచ్చారు. కోలార్కు చెందిన పలు సంస్థలు ఈ బంద్కు మద్దతు ఇచ్చాయి.
ఈ సందర్భంగా గాడిదతో నిరసన తెలిపారు. చాలా ఏళ్లుగా కోలార్ జిల్లాను పట్టించుకోవడం లేదని, అభివృద్ధి చేయడం లేదని నిరసనకారులు ఆరోపించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వీధి లైట్లు, స్కూళ్లు వంటి మౌలిక సదుపాయాలు లోపించాయని విమర్శించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోని రాజకీయ ప్రతినిధులను గాడిదతో పోల్చారు.
కాగా, కోలార్లో బంద్ సందర్భంగా పలువురు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. స్కూల్ బస్సులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ నగరంలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
Various organisations called for bandh in #Kolar today.
Demanding better roads & infrastructure in Kolar- the bandh has been called.
Protestors even brought a donkey to the protest comparing them to politicians who ignore the infrastructure needed for the people.#Karnataka pic.twitter.com/JWFlJ0ar2q
— Hate Detector 🔍 (@HateDetectors) December 16, 2022