న్యూఢిల్లీ, మార్చి 6: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించే కార్యక్రమం పూర్తైందని, భక్తులు విరాళం ఇవ్వాలనుకొంటే ఆన్లైన్ ద్వారా ఇవ్వవచ్చని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శనివారం తెలిపారు. ట్రస్టు వెబ్సైట్ ద్వారా విరాళాలు ఇవ్వడానికి ఇంకా అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 4వ తేదీ వరకు రూ.2500 కోట్ల దాకా విరాళాలు వచ్చాయని వెల్లడించారు. రామాలయ కాంప్లెక్స్ నిర్మాణాన్ని సుప్రీంకోర్టు కేటాయించిన 70 ఎకరాలకే పరిమితం చేయకుండా.. 107 ఎకరాల్లో విస్తరించాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. ప్రధానాలయాన్ని 5 ఎకరాల్లో నిర్మిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న స్థలం పక్కన మరింత భూమిని కొనుగోలు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నామని, తుది నిర్ణయం తీసుకోలేదన్నార