Bengaluru | బెంగళూరు: మామూలు రోజుల్లోనే బెంగళూరు ట్రాఫిక్ ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. దానికి తోడు కావేరి జలాల వివాదంలో బంద్కు పిలుపునివ్వడంతో గురువారం నగరవాసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని నరకమే చూశారు.
ఇలాంటి పరిస్థితుల్లో కారులో ప్రయాణిస్తూ ఔటర్ రింగ్ రోడ్పై గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న కొందరు పిజ్జాకు ఆర్డర్ ఇవ్వడం, దానిని ఆన్టైమ్లోనే డెలివరీ బాయ్ ట్రాఫిక్లో ఇరుక్కుని ఉన్న కారు వద్దకే వచ్చి డెలివరీ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మా కారు లైవ్ లొకేషన్ ఆధారంగా పిజ్జా డెలివరీ చేసిన డోమినోస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ రిషీవత్ పేరిట ఎక్స్లో పోస్టు చేశారు.