లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా ఆసుపత్రిలో పవర్ కట్తో వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటకుపైగా కరెంట్ రాలేదు. దీంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. శనివారం భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. గంటకుపైగా కరెంట్ రాలేదు. ఆసుపత్రిలోని జెనరేటర్ పని చేయలేదు. అత్యవసర లైట్లు కూడా లేవు. దీంతో చేసేదేమీ లేక డాక్టర్లు తమ మొబైల్ ఫోన్లలోని టార్చ్లైట్ వెలుగు సహాయంతో వైద్య సేవలు అందించారు. సుమారు గంటకుపైగా ఆ ఆసుపత్రి చీకటి మయంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ సంఘటనపై బల్లియా జిల్లా ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ ఆర్డీ రామ్ సోమవారం వివరణ ఇచ్చారు. పవర్ కట్ వల్ల డాక్టర్లు, రోగులు కేవలం 20 నిమిషాలు మాత్రమే ఇబ్బంది పడినట్లు తెలిపారు. గతంలో జెనరేటర్ బ్యాటరీలు చోరీ కావడంతో వీటిని విడిగా ఉంచినట్లు చెప్పారు. దీంతో బ్యాటరీలను సెట్ చేసి జెనరేటర్ ఆన్ చేసేందుకు కొంత సమయం పట్టిందని చెప్పారు.
మరోవైపు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వసతులు, సౌకర్యాలపై ఈ సంఘటన పలు సందేహాలు లేవనెత్తింది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకు స్పందించలేదు.
Doctors and medical staff at district hospital in UP's Ballia examine patients under mobile torch light due to power cut. pic.twitter.com/3LlOLsZUF2
— Piyush Rai (@Benarasiyaa) September 12, 2022